పాట 47
సువార్త చాటుదాం
1. దయాళుడు, నీతిమంతుడు యెహోవా
మానవుని స్థితి చూసి చలించాడు.
రాజ్యాన్ని స్థాపించాలని ఉద్దేశించి
భూమికి రాజుగా చేశాడు క్రీస్తును.
దత్తత తీసుకుని చిన్న మందను
క్రీస్తు యేసుకు తోటి రాజుల్ని చేశాడు.
క్రీస్తే వాగ్దాన సంతానమని తెల్సి,
మరింత స్పష్టమైంది రాజ్య సత్యము.
2. యెహోవా వెల్లడించి ఆ సువార్తను
ప్రకటించాలని మనకు తెల్పాడు.
ఈ రాజ్య సందేశాన్ని చాటే పనిలో
సంతోషంగా సాయం చేస్తారు దూతలు.
పరిశుద్ధపర్చి ఆయన నామాన్ని
ఘనతను కీర్తిని తేవాలి మనము.
ప్రకటిస్తూ మనం నిత్య సువార్తను
గర్విద్దాం దైవ సాక్షులమైనందుకు.
(మార్కు 4:11; అపొ. 5:31; 1 కొరిం. 2:1, 7 కూడా చూడండి.)