కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 4

సాతాను మాట వినడం వల్ల ఏం జరిగింది?

సాతాను మాట వినడం వల్ల ఏం జరిగింది?

ఆదాముహవ్వలు దేవుని మాట వినలేదు, అందుకే చనిపోయారు. ఆదికాండం 3:6, 23

పాము మాట విని హవ్వ ఆ చెట్టు పండు తిన్నది, తర్వాత ఆదాముకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు.

వాళ్లు తప్పు చేశారు, అంటే పాపం చేశారు. అందుకే దేవుడు వాళ్లను పరదైసు నుండి పంపించేశాడు.

వాళ్లకు, వాళ్ల పిల్లలకు జీవితం కష్టంగా తయారైంది. వాళ్లిద్దరు ముసలివాళ్లయి చనిపోయారు. వాళ్లు ఆత్మలుగా వేరే లోకానికి వెళ్లలేదు, ఎక్కడా లేకుండా పోయారంతే.

చనిపోయినవాళ్లు మట్టిలో కలిసిపోతారు. ఆదికాండం 3:19

మనందరం ఆదాముహవ్వల పిల్లలం కాబట్టే చనిపోతున్నాం. చనిపోయినవాళ్లు ఏమీ చూడలేరు, వినలేరు, చేయలేరు.—ప్రసంగి 9:5, 10.

మనుషులు చనిపోవడం యెహోవా ఉద్దేశం కాదు. చనిపోయినవాళ్లను ఆయన త్వరలోనే బ్రతికిస్తాడు. వాళ్లు దేవుని మాట వింటే నిరంతరం జీవిస్తారు.