కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 30

రాహాబు గూఢచారులను దాచిపెట్టింది

రాహాబు గూఢచారులను దాచిపెట్టింది

ఇశ్రాయేలీయులైన గూఢచారులు యెరికో పట్టణానికి వెళ్లినప్పుడు వాళ్లు రాహాబు అనే ఆమె ఇంట్లో ఉన్నారు. ఆ విషయం యెరికో రాజుకు తెలిసింది, ఆయన రాహాబు ఇంటికి సైనికులను పంపించాడు. ఆమె ఆ ఇద్దరు గూఢచారుల్ని ఇంటి పైన దాచిపెట్టి సైనికుల్ని వేరే వైపు పంపించింది. ఆమె ఆ ఇద్దరితో ఇలా అంది: ‘యెహోవా మీ వైపు ఉన్నాడని, మీరు ఈ దేశాన్ని ఓడిస్తారని నాకు తెలుసు కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను. ప్లీజ్‌, మీరు నా కుటుంబాన్ని కాపాడతారని మాటివ్వండి.’

వాళ్లు రాహాబుతో ఇలా అన్నారు: ‘మీ ఇంటి లోపల ఉన్నవాళ్లెవ్వరికీ ఏమి కాదని మాటిస్తున్నాం. మీ కిటికీకి ఒక ఎర్ర తాడు కట్టు, అప్పుడు మీ కుటుంబానికి ఏం కాదు.’

రాహాబు తన ఇంటి కిటికీకి ఒక తాడు కట్టి దాని ద్వారా ఆ గూఢచారులను కిందకు దించింది. వాళ్లు కొండలకు వెళ్లిపోయి అక్కడ మూడు రోజులు దాక్కుని యెహోషువ దగ్గరకు తిరిగి వెళ్తారు. తర్వాత ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటి, ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధం అయ్యారు. వాళ్లు ఓడించిన మొదటి పట్టణం యెరికో. యెహోవా వాళ్లను ఆరు రోజులు ఆ పట్టణం చుట్టు రోజుకు ఒకసారి తిరగమని చెప్పాడు. ఏడవ రోజున, వాళ్లు ఆ పట్టణం చుట్టూ ఏడు సార్లు తిరిగారు. తర్వాత యాజకులు బూరలు ఊదారు. సైనికులందరూ అరవగలిగినంత గట్టిగా అరిచారు. ఆ పట్టణం గోడలు కూలిపోయాయి. అయితే, ఆ గోడ మీద ఉన్న రాహాబు ఇల్లు మాత్రం అలానే ఉంది. రాహాబు యెహోవాను నమ్మింది కాబట్టి ఆమెకు, ఆమె కుటుంబానికి ఏమీ కాలేదు.

“రాహాబు . . . తన ఇంట్లో గూఢచారులకు చోటిచ్చి, ఆతిథ్యమిచ్చి, వాళ్లను మరో దారిన పంపించేసింది. అలా ఆమె కూడా చేతల వల్ల నీతిమంతురాలని తీర్పు పొందలేదా?”—యాకోబు 2:25