కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

సా.శ. 70 తర్వాత యెరూషలేము దేవాలయాన్ని మళ్ళీ ఎప్పుడైనా కట్టారా?

‘రాతిమీద రాయి ఒకటైనను నిలిచియుండకుండ’ యెరూషలేము దేవాలయం ‘పడద్రోయబడుతుందని’ యేసు ప్రవచించాడు. ఆ ప్రవచనం సా.శ. 70లో టైటస్‌ నేతృత్వంలోని రోమా సైన్యం యెరూషలేమును నాశనం చేసినప్పుడు నెరవేరింది. (మత్త. 24:2) ఆ తర్వాతి కాలంలో జూలియన్‌ చక్రవర్తి ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ప్రణాళిక వేశాడు.

రోముకు జూలియన్‌ చివరి అన్యమత చక్రవర్తి అని ప్రాచుర్యంలో ఉంది. కాన్‌స్టంటైన్‌ సోదరుని కుమారుడైన ఈ జూలియన్‌, నామమాత్రపు క్రైస్తవ విద్యను అభ్యసించాడు. కానీ, సా.శ. 361లో అతను చక్రవర్తి అయ్యాక, అన్యమతాన్ని సమర్థిస్తూ ఆ క్రైస్తవ విద్యను, కలుషితమైపోయిన ఆనాటి క్రైస్తవత్వాన్ని బాహాటంగా తిరస్కరించాడు. చరిత్ర పుస్తకాలు అతణ్ణి “మతభ్రష్టుడు” అని సంబోధిస్తున్నాయి.

జూలియన్‌ క్రైస్తవత్వాన్ని అసహ్యించుకున్నాడు. బహుశా అందుకు గల ఒక కారణమేమిటంటే అతను ఆరేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు, ఆ మత ప్రతినిధులు తన తండ్రిని, తన రక్తసంబంధీకుల్లోని మగవాళ్లను చంపడాన్ని కళ్లారా చూశాడు. చర్చీ చరిత్రకారుల ప్రకారం జూలియన్‌ చక్రవర్తి, యేసు అబద్ధ ప్రవక్త అని నిరూపించడానికి యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టమని యూదుల్ని ప్రోత్సహించాడు. a

జూలియన్‌ ఆ ఆలయాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నించాడన్నది వాస్తవమే. జూలియన్‌ అసలు ఆ పనిని ప్రారంభించాడా, ఒకవేళ ప్రారంభిస్తే అది ఎందుకు ఆగిపోయింది అని చరిత్రకారులు వాదులాడుకుంటున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టం. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాకముందే జూలియన్‌ హతమయ్యాడు, అతని ప్రణాళిక కూడా అతనితో పాటే అంతరించింది.

ఇప్పటి ప్రదేశంలో, యేసు కాలంనాటి యెరూషలేము దేవాలయపు ఊహాచిత్రం

a యేసు ఆ ఆలయం నాశనం అవుతుందని చెప్పాడే కానీ దాన్ని ఎన్నటికీ తిరిగి కట్టరని చెప్పలేదు. యెరూషలేము దేవాలయం సా.శ. 70లో నాశనమైంది.