“దీనులు భూమిని స్వతంత్రించుకొందురు”
మనలో చాలామందిమి న్యాయం పక్కదారి పట్టడం, మంచివాళ్లు, అమాయకులు దుర్మార్గుల చేతిలో అణచివేయబడడం చూసే ఉంటాము. అన్యాయం, దుర్మార్గం లేని కాలం ఎప్పటికైనా వస్తుందంటారా?
బైబిల్లో ఉన్న 37వ కీర్తన దానికి జవాబు ఇస్తుంది, జవాబుతోపాటు మనం ఇప్పుడు ఏమి చేయాలో కూడా చెప్తుంది. ఈ ముఖ్యమైన ప్రశ్నల గురించి అది ఏమి చెప్తుందో చూడండి.
మనల్ని అణచివేసేవాళ్లను మనం ఎలా చూడాలి?—1, 2 వచనాలు.
చెడ్డవాళ్లకు ఏమి జరుగుతుంది?—10వ వచనం.
మనం ఇప్పుడు ఏమి చేయాలి?—34వ వచనం.
దేవుని చేత ప్రేరేపించబడి రాయబడిన 37వ కీర్తనలో మాటలు యెహోవాకొరకు కనిపెట్టుకొని ఆయన మార్గము అనుసరించేవాళ్లకు మంచి భవిష్యత్తు ఉందని చూపిస్తున్నాయి. బైబిలు గురించి నేర్చుకోవడానికి, మీకోసం మీరు ప్రేమించే వాళ్ల కోసం మంచి భవిష్యత్తును ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సహాయం చేస్తారు.