లేవీయకాండం 12:1-8

  • ప్రసవం తర్వాత శుద్ధీకరణ (1-8)

12  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “నువ్వు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఒక స్త్రీ గర్భవతి అయ్యి మగబిడ్డను కంటే, రుతుస్రావం జరుగుతున్న రోజుల్లోలాగే ఏడురోజుల పాటు ఆమె అపవిత్రురాలిగా ఉంటుంది.+  ఎనిమిదో రోజున ఆ పిల్లవాడికి సున్నతి చేయాలి.+  రక్తస్రావం కారణంగా ఏర్పడిన అపవిత్రతను శుద్ధి చేసుకోవడానికి ఆమెకు ఇంకా 33 రోజులు పడుతుంది. తన శుద్ధీకరణ రోజులు పూర్తయ్యే వరకు ఆమె పవిత్రమైన ఏ వస్తువునూ ముట్టకూడదు, పవిత్ర స్థలంలోకి రాకూడదు.  “ ‘ఒకవేళ ఆమె ఆడపిల్లను కంటే, రుతుస్రావం సమయంలోలాగే 14 రోజులపాటు ఆమె అపవిత్రురాలిగా ఉంటుంది. రక్తస్రావం కారణంగా ఏర్పడిన అపవిత్రతను శుద్ధి చేసుకోవడానికి ఆమెకు ఇంకా 66 రోజులు పడుతుంది.  కుమారుడు లేదా కూతురు పుట్టిన తర్వాత శుద్ధీకరణ రోజులు పూర్తయినప్పుడు, ఆమె దహనబలి కోసం ఏడాది మగ గొర్రెపిల్లను,+ పాపపరిహారార్థ బలి కోసం ఒక పావురం పిల్లను లేదా ఒక గువ్వను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి తీసుకొచ్చి యాజకునికి ఇవ్వాలి.  అతను యెహోవా ముందు దాన్ని అర్పించి, ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు ఆమె తన రక్తస్రావం వల్ల కలిగిన అపవిత్రత నుండి శుద్ధురాలు అవుతుంది. ఒక స్త్రీ కుమారుణ్ణి గానీ కూతుర్ని గానీ కన్నప్పుడు పాటించాల్సిన నియమం ఇది.  ఒకవేళ గొర్రెను అర్పించేంత స్తోమత ఆమెకు లేకపోతే, ఆమె రెండు గువ్వల్ని గానీ రెండు పావురం పిల్లల్ని గానీ తీసుకురావాలి.+ ఒకటి దహనబలి కోసం, ఇంకొకటి పాపపరిహారార్థ బలి కోసం. అప్పుడు యాజకుడు ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, ఆమె శుద్ధురాలు అవుతుంది.’ ”

అధస్సూచీలు