దినవృత్తాంతాలు రెండో గ్రంథం 30:1-27

  • హిజ్కియా పస్కాను ఆచరించడం (1-27)

30  ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించేందుకు యెరూషలేములోని యెహోవా మందిరానికి రమ్మని+ హిజ్కియా ఇశ్రాయేలు, యూదా ప్రజలందరికీ+ కబురు పంపించాడు. అతను ఎఫ్రాయిము, మనష్షే వాళ్లకు+ ఉత్తరాలు కూడా రాసి పంపించాడు.  అయితే రాజు, అతని అధిపతులు, యెరూషలేములోని సమాజమంతా పస్కాను రెండో నెలలో ఆచరించాలని నిర్ణయించారు.+  యాజకులు తగినంతమంది తమను తాము పవిత్రపర్చుకోలేదు,+ అలాగే యెరూషలేములో ప్రజలు సమకూడలేదు కాబట్టి వాళ్లు ఆ పండుగను సరైన సమయంలో ఆచరించలేకపోయారు.+  ఈ ఏర్పాటు రాజుకూ, సమాజమంతటికీ సరైనదని అనిపించింది.  కాబట్టి, బెయేర్షెబా నుండి దాను+ వరకు ఇశ్రాయేలు ప్రాంతమంతటా ప్రకటన చేయించి, యెరూషలేములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా ఆచరించడానికి ప్రజల్ని ఆహ్వానించాలని వాళ్లు నిర్ణయించారు. ధర్మశాస్త్రం నిర్దేశించినట్టు, వాళ్లు ఒక సమూహంగా దాన్ని ఆచరించలేదు.+  అప్పుడు రాజాజ్ఞ ప్రకారం రాజు, అతని అధిపతులు రాసిన ఉత్తరాలు తీసుకొని వార్తాహరులు* ఇశ్రాయేలు, యూదా అంతటికీ వెళ్లి ఇలా చాటించారు: “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగిరండి. అప్పుడు అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకున్న మిగిలినవాళ్ల దగ్గరికి ఆయన తిరిగొస్తాడు.+  మీరు మీ పూర్వీకుల్లా, మీ సహోదరుల్లా ఉండకండి; వాళ్లు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా పట్ల నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. అందుకే ఆయన వాళ్ల మీదికి నాశనాన్ని తీసుకొచ్చాడు. మీరు దాన్ని కళ్లారా చూస్తున్నారు.+  మీరు మీ పూర్వీకుల్లా మొండిగా ఉండకండి.+ యెహోవాకు లోబడండి, ఆయన శాశ్వతంగా పవిత్రపర్చిన ఆయన పవిత్రమైన స్థలానికి వచ్చి,+ మీ దేవుడైన యెహోవాను సేవించండి. అప్పుడు ఆయన కోపాగ్ని మీ మీద నుండి మళ్లుతుంది.+  మీరు యెహోవా దగ్గరికి తిరిగొస్తే మీ సహోదరుల్ని, మీ కుమారుల్ని బందీలుగా తీసుకెళ్లినవాళ్లు వాళ్లమీద కరుణ చూపించి,+ వాళ్లను ఈ దేశానికి తిరిగి రానిస్తారు.+ ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా కనికరం,* కరుణ గల దేవుడు.+ మీరు ఆయన దగ్గరికి తిరిగొస్తే ఆయన తన ముఖాన్ని పక్కకు తిప్పుకోడు.”+ 10  వార్తాహరులు* ఎఫ్రాయిము, మనష్షే, చివరికి జెబూలూను ప్రాంతమంతటా ఉన్న ఒక్కో నగరానికి వెళ్లారు.+ కానీ ప్రజలు వాళ్లను హేళన చేశారు, ఎగతాళి చేశారు.+ 11  అయితే ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకొని యెరూషలేముకు వచ్చారు.+ 12  సత్యదేవుని అనుగ్రహం యూదావాళ్ల మీద ఉండడంతో వాళ్లు యెహోవా మాట ప్రకారం రాజు, అధిపతులు ఆజ్ఞాపించినదాన్ని ఐక్యంగా* చేశారు. 13  రెండో నెలలో+ పులవని రొట్టెల పండుగ+ ఆచరించడానికి యెరూషలేములో చాలామంది ప్రజలు సమకూడారు; అది చాలా పెద్ద సమూహం. 14  వాళ్లు లేచి యెరూషలేములో ఉన్న బలిపీఠాల్ని, ధూపవేదికలన్నిటినీ+ తొలగించి+ వాటిని కిద్రోను లోయలో పడేశారు. 15  వాళ్లు రెండో నెల 14వ రోజున పస్కా బలి జంతువును వధించారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి, తమను తాము పవిత్రపర్చుకొని యెహోవా మందిరంలోకి దహనబలుల్ని తీసుకొచ్చారు. 16  సత్యదేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రం నిర్దేశించిన ప్రకారం వాళ్లు తమతమ స్థానాల్లో నిలబడ్డారు; యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తాన్ని తీసుకొని బలిపీఠం మీద చిలకరించారు.+ 17  తమను తాము పవిత్రపర్చుకోనివాళ్లు సమాజంలో చాలామంది ఉన్నారు; వాళ్లందర్నీ యెహోవా కోసం పవిత్రపర్చడానికి పస్కా బలి జంతువుల్ని వధించే బాధ్యత లేవీయులకు అప్పగించబడింది.+ 18  చాలామంది ప్రజలు ముఖ్యంగా ఎఫ్రాయిము, మనష్షే,+ ఇశ్శాఖారు, జెబూలూను ప్రజలు తమను తాము పవిత్రపర్చుకోలేదు. అయినా వాళ్లు ధర్మశాస్త్రంలో రాయబడినదానికి విరుద్ధంగా పస్కాను తిన్నారు. అయితే హిజ్కియా వాళ్ల కోసం ఇలా ప్రార్థించాడు: “మంచివాడైన యెహోవా+ క్షమించాలి, 19  పవిత్రతకు సంబంధించిన ప్రమాణం ప్రకారం తమను తాము పవిత్రపర్చుకోకపోయినా,+ తమ పూర్వీకుల దేవుడూ సత్యదేవుడూ అయిన యెహోవాను వెదకడానికి హృదయాన్ని సిద్ధం చేసుకున్న ప్రతీ ఒక్కర్ని+ ఆయన క్షమించాలి.” 20  యెహోవా హిజ్కియా ప్రార్థన విని, ప్రజల్ని క్షమించాడు.* 21  అలా యెరూషలేములోని ఇశ్రాయేలీయులు ఎంతో సంతోషంగా+ ఏడురోజులు పులవని రొట్టెల పండుగను ఆచరించారు.+ లేవీయులు, యాజకులు ప్రతీరోజు యెహోవాను స్తుతించారు, తమ వాద్యాల్ని బిగ్గరగా వాయిస్తూ+ యెహోవాను స్తుతించారు. 22  అంతేకాదు, హిజ్కియా యెహోవాను వివేచనతో* సేవించిన లేవీయులందరితో మాట్లాడి, వాళ్లను ప్రోత్సహించాడు. వాళ్లు ఆ పండుగలో ఏడురోజుల పాటు తింటూ,+ సమాధాన బలులు+ అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. 23  తర్వాత సమాజమంతా మరో ఏడురోజులు దాన్ని ఆచరించాలని నిర్ణయించింది. కాబట్టి వాళ్లు సంతోషంగా మరో ఏడురోజులు దాన్ని ఆచరించారు.+ 24  యూదా రాజైన హిజ్కియా సమాజం కోసం 1,000 ఎద్దుల్ని, 7,000 గొర్రెల్ని విరాళంగా ఇచ్చాడు. అధిపతులు సమాజం కోసం 1,000 ఎద్దుల్ని, 10,000 గొర్రెల్ని విరాళంగా ఇచ్చారు;+ పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రపర్చుకుంటూ ఉన్నారు.+ 25  యూదా సమాజమంతా, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన సమాజమంతా,+ ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన విదేశీయులు, యూదాలో నివసిస్తున్న విదేశీయులు+ సంతోషిస్తూ ఉన్నారు. 26  అప్పుడు యెరూషలేములో ఎంతో సంతోషం వెల్లివిరిసింది. ఎందుకంటే ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను రోజుల నుండి యెరూషలేములో అలాంటిది జరగలేదు.+ 27  చివర్లో లేవీయులైన యాజకులు నిలబడి ప్రజల్ని దీవించారు;+ దేవుడు వాళ్ల ప్రార్థన విన్నాడు, వాళ్ల ప్రార్థన ఆయన పవిత్ర నివాస స్థలమైన పరలోకానికి చేరింది.

అధస్సూచీలు

అక్ష., “పరుగెత్తేవాళ్లు.”
లేదా “దయ.”
అక్ష., “పరుగెత్తేవాళ్లు.”
లేదా “ఒకే హృదయంతో.”
అక్ష., “బాగుచేశాడు.”
లేదా “బుద్ధితో.”