కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లక్షలాదిమంది వెళ్తున్నారు మీరూ వెళ్తారా?

లక్షలాదిమంది వెళ్తున్నారు మీరూ వెళ్తారా?

లక్షలాదిమంది వెళ్తున్నారు మీరూ వెళ్తారా?

వాళ్ళెక్కడికి వెళ్తున్నారు? యేసు క్రీస్తు మరణాన్ని గురించిన వార్షిక జ్ఞాపకార్థ ఆచరణకు వెళ్తున్నారు. 2000వ సంవత్సరంలో ఆ ఆచరణకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,48,72,086 మంది హాజరయ్యారు.

వాళ్ళెందుకు వెళ్తారు? క్రీస్తు మరణం మానవజాతికి ఎంతో ప్రాముఖ్యమైనది గనుకనే వెళ్తారు. ఆయన మరణం మూలంగా రోగం, కష్టాలు, మరణం మొదలైన వాటి నుండి త్వరలోనే విడుదల లభిస్తుంది. చనిపోయిన ప్రియమైనవారు సహితం పరదైసు భూమి మీద జీవించేందుకు పునరుత్థానం చేయబడతారు.

యేసు మరణం అలాంటి ఆశీర్వాదాలను ఎలా తీసుకురాగలదు? అదెలాగో కనుగొనేందుకు మీరు కూడా ఆహ్వానించబడుతున్నారు. ఈ ప్రాముఖ్యమైన సందర్భంలో మీరు కూడా తమతోపాటు పాల్గొనాలని యెహోవాసాక్షులు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

మీ ఇంటికి సమీపాన ఉన్న రాజ్యమందిరంలో హాజరు కండి. ఈ సంవత్సరం ఆ జ్ఞాపకార్థ ఆచరణ ఆదివారం, ఏప్రిల్‌ 8న, సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. అది సరిగ్గా ఏ సమయానికి ప్రారంభమౌతుందన్నది స్థానిక సాక్షులను అడిగి తెలుసుకోండి. (g01 3/22)