కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన

చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన

చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన

అది యేసుక్రీస్తు మరణం. అది ఎందుకంత ప్రాముఖ్యమైనది? దానికి అనేక కారణాలున్నాయి.

యేసు మరణం వరకు నమ్మకంగా ఉండడం, మానవుడు దేవుని పట్ల తన యథార్థతను కాపాడుకోగలడని నిరూపించింది.

క్రీస్తు మరణం కొందరు ఆయనతో పాటు పరలోకంలో సహపరిపాలకులయ్యే అవకాశాన్ని ఇచ్చింది. భూపరదైసుపై ఇంకా అనేకులు నిత్యజీవాన్ని అనుభవించడానికి అది మార్గాన్ని తెరిచింది కూడా.

యేసు తాను మరణించక ముందు రాత్రి, తన మానవజీవాన్ని తాను ప్రేమపూర్వకంగా అర్పించిన బలికి చిహ్నాలుగా పులియని రొట్టెను, ఎర్రని ద్రాక్షారసమును ఉపయోగించాడు. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” తన శిష్యులకు చెప్పాడు. (లూకా 22:​19) మీరు ఈ ప్రాముఖ్యమైన సంఘటనను గుర్తుంచుకుంటారా?

యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు తమతో కలవమని యెహోవాసాక్షులు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సంవత్సరం ఇది ఆచరించబడే తేదీ, మార్చి 28, గురువారం, సూర్యాస్తమయం తరవాత. మీ ఇంటికి దగ్గరలో ఉన్న రాజ్యమందిరంలో మీరు హాజరు కావచ్చు. ఖచ్చితమైన సమయం, స్థలం తెలుసుకోవడానికి దయచేసి స్థానిక యెహోవాసాక్షులను సంప్రదించండి.