కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి ప్రపంచవ్యాప్త సంస్థ, సేవ

వారి ప్రపంచవ్యాప్త సంస్థ, సేవ

వారి ప్రపంచవ్యాప్త సంస్థ, సేవ

సాక్ష్యపు పని జరిగే 200 కంటే ఎక్కువ దేశాల్లో దీన్ని నడిపించడానికి అనేక పద్ధతులు ఉపయోగించబడ్డాయి. న్యూయార్క్‌నందలి బ్రూక్లిన్‌లోని ప్రపంచ ప్రధాన కార్యాలయాల్లోని పరిపాలక సభ నుండి మొత్తం నడిపింపు వస్తుంది. ప్రతి సంవత్సరం పరిపాలక సభ ప్రతీ జోన్‌లోనున్న బ్రాంచి ప్రతినిధులతో చర్చలు జరపడానికి ప్రపంచవ్యాప్తంగానున్న 15 లేదా అంతకంటే ఎక్కువ “జోన్‌లకు” ప్రతినిధులను పంపుతుంది. బ్రాంచి కార్యాలయాలలో, తమ అధికార పరిధిలోనున్న దేశాలను పర్యవేక్షించడానికి మూడు నుండి ఏడుగురు సభ్యులున్న బ్రాంచ్‌ కమిటీలుంటాయి. అనేక బ్రాంచీలు ముద్రణా సదుపాయాలను కల్గివున్నాయి, కొన్ని ఎంతో వేగంగా పనిచేసే రోటరీ ప్రెస్‌లను కూడ కల్గివున్నాయి. ప్రతి బ్రాంచి పనిచేస్తున్న దేశం లేదా ఆ ప్రాంతం జిల్లాలుగాను, జిల్లాలు మరలా ప్రాంతాలుగాను విభజించబడ్డాయి. ప్రతీ ప్రాంతంలోను దాదాపు 20 సంఘాలుంటాయి. ఒక జిల్లా కాపరి తన జిల్లాలోని ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటాడు. ప్రతీ ప్రాంతంలోను వార్షికంగా రెండు సమావేశాలు జరుపబడతాయి. ప్రతి ప్రాంతానికి ప్రాంతీయ కాపరి కూడ ఉంటాడు, మరి ఆయన తన ప్రాంతంలోని ప్రతి సంఘాన్ని సంవత్సరానికి రెండుసార్లు దర్శిస్తూ, ఆ సంఘానికి నియమింపబడిన ప్రాంతంలో సువార్త సేవ చేయడంలోను, సంస్థీకరించడంలోను సహాయంచేస్తాడు.

రాజ్యమందిరంతోపాటు స్థానిక సంఘం మీ సమాజంలో సువార్త చెప్పడానికి కేంద్రమైయుంది. ప్రతీ సంఘం ఆధ్వర్యంలోనున్న ప్రాంతం, చిన్న ప్రాంతాలుగా మ్యాప్‌లో చిత్రీకరించబడతాయి. అక్కడున్న ప్రతీ ఇంటివారిని దర్శించి, మాట్లాడటానికి ప్రయత్నించే సాక్షులకు వ్యక్తిగతంగా నియమింపబడతాయి. కొద్దిమంది నుండి దాదాపు 200 మంది సాక్షులను కల్గియున్న ఏ సంఘానికైనా, వివిధ సేవలను నిర్వహించడానికి పెద్దలు నియమింపబడతారు. యెహోవాసాక్షుల సంస్థలో ప్రతీ ఒక్క సువార్తికుడు కూడ విలువైనవాడే. సాక్షులలో ప్రతిఒక్కడు, ప్రపంచ ప్రధానకార్యాలయాల్లో సేవచేస్తున్నా, బ్రాంచి కార్యాలయాల్లో లేదా సంఘాల్లో సేవచేస్తున్నా, దేవుని రాజ్యాన్నిగూర్చి ఇతరులకు వ్యక్తిగతంగా చెప్పే ఈ ప్రాంతీయ సేవను చేస్తాడు.

ఈ సేవకు సంబంధించిన రిపోర్టులు ప్రపంచ ప్రధాన కార్యాలయాలకు చేరతాయి, తద్వారా వార్షికంగా ఇయర్‌బుక్‌ సమకూర్చబడి, ముద్రించబడుతుంది. అంతేకాకుండా, కావలికోట జనవరి 1వ సంచికలో ప్రతి సంవత్సరం ఒక పట్టిక ముద్రించబడుతుంది. ఈ రెండు సాహిత్యాలూ యెహోవాను గూర్చి, క్రీస్తు యేసు పాలనలోని ఆయన రాజ్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడంలో ఆ సంవత్సరం పొందిన విజయాలను గూర్చి వివరణాత్మక రిపోర్టులను అందిస్తాయి. పందొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యేసు వార్షిక జ్ఞాపకార్థ మరణ దినానికి 1993లో 1,18,65,765 మంది సాక్షులు, ఆసక్తిగలవారు హాజరైనట్లు 1994 ఇయర్‌బుక్‌ నివేదించింది. యెహోవాసాక్షులు 1993 సేవాసంవత్సరంలో, 105,70,00,000 గంటలు సువార్త ప్రకటించడంలో గడిపారు, ఆలాగే 2,96,004 మంది క్రొత్తవారు బాప్తిస్మం పొందారు. కోట్లాది సాహిత్యాలు అందించబడ్డాయి.