1వ భాగం
సృష్టి నుండి జలప్రళయం వరకు
భూమ్యాకాశాలు ఎక్కడనుండి వచ్చాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అలాగే భూమ్మీద ఉన్న అనేక వస్తువులు ఎలా వచ్చాయి? వాటన్నింటిని దేవుడే సృష్టించాడు అని చెబుతూ బైబిలు సరైన సమాధానాన్ని ఇస్తుంది. అందుకే మన ఈ పుస్తకము సృష్టికి సంబంధించిన బైబిలు కథలతో మొదలవుతుంది.
దేవుని మొదటి సృష్టి ఆయనలాంటి ఆత్మ వ్యక్తులే అని మనం తెలుసుకుంటాం. వారు దేవదూతలు. అయితే భూమి మనలాంటి మనుష్యుల కోసం సృష్టించబడింది. కాబట్టి దేవుడు పురుషున్ని, స్త్రీని చేసి వారికి ఆదాము, హవ్వ అని పేర్లుపెట్టి వారిని ఒక అందమైన తోటలో ఉంచాడు. కానీ వారు దేవునికి అవిధేయత చూపించినందుకు నిరంతరం జీవించే హక్కును పోగొట్టుకొన్నారు.
ఆదాము సృష్టించబడినప్పటి నుండి జలప్రళయం వరకు మొత్తం 1,656 సంవత్సరాలు. ఈ కాలంలో చాలామంది చెడ్డ వ్యక్తులు జీవించారు. పరలోకంలో అదృశ్య ఆత్మ ప్రాణులైన సాతాను, అతని చెడ్డ దూతలు ఉండేవారు. భూమ్మీద కయీను, అనేకమంది ఇతర చెడ్డ వ్యక్తులతో పాటు అసాధారణ శక్తిగల మనుష్యులు కూడా ఉండేవారు. అయితే భూమ్మీద హేబెలు, హనోకు, నోవహులాంటి మంచివాళ్లు కూడా ఉండేవారు. ఆ ప్రజల గురించి, జరిగిన సంఘటనల గురించి ఈ మొదటి భాగంలో మనం చదువుతాం.
ఈ భాగంలో
1వ కథ
దేవుడు సృష్టిని ప్రారంభించడం
ఆదికాండములో ఉన్న సృష్టి కథ, పెద్ద పిల్లలతో పాటు చిన్న పిల్లలకు కూడా త్వరగా అర్థమవుతుంది. చాలా నచ్చుతుంది.
2వ కథ
ఒక అందమైన తోట
ఆదికాండము ప్రకారం దేవుడు ఏదెను తోటను చాలా ప్రత్యేకమైనదానిగా చేశాడు. ఆ అందమైన తోటలాగే భూమంతా అందంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు.
3వ కథ
మొదటి పురుషుడు, స్త్రీ
దేవుడు ఆదాము హవ్వను చేసి ఏదెను తోటలో ఉంచాడు. వాళ్లే లోకంలో మొదట పెళ్లైన వాళ్లు.
4వ కథ
వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం
మొదట్లో ఉన్న పరదైసు ఎలా పోయిందో, బైబిలు పుస్తకమైన ఆదికాండములో ఉంది.
5వ కథ
కష్టమైన జీవితం మొదలవడం
ఏదెను తోట బయట ఆదాము హవ్వలకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. వాళ్లు దేవునికి విధేయత చూపించివుంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు సంతోషంగా జీవించేవారు.
6వ కథ
మంచి కుమారుడు, చెడ్డ కుమారుడు
ఆదికాండములో ఉన్న కయీను హేబెలు కథ నుండి మనం దేవునికి ఇష్టమైన వాళ్లుగా ఉండాలంటే ఎలా ఉండాలో, పరిస్థితులు మారిపోకముందే మనం ఎలా ఉండడం మానుకోవాలో తెలుస్తుంది.
7వ కథ
ఒక ధైర్యవంతుడు
చుట్టూవున్న ప్రజలు చెడ్డ పనులు చేస్తున్నా మనం మాత్రం మంచి పనులు చేయవచ్చని హనోకును చూసి నేర్చుకోవచ్చు.
8వ కథ
భూమిపై రాక్షసులు
ఆదికాండము 6వ అధ్యాయం ప్రజల్ని ఏడిపించిన రాక్షసుల గురించి చెప్తుంది. ఆ రాక్షసులను నెఫీలులు అని పిలిచేవాళ్లు. వాళ్ళ తండ్రులు పరలోకంనుండి కిందికి వచ్చి మనుషుల్లా జీవించిన దేవదూతలు.
9వ కథ
నోవహు ఓడను నిర్మించడం
వేరేవాళ్లు వినకపోయినా నోవహు ఆయన కుటుంబం దేవుని మాట విన్నారు కాబట్టి జలప్రవయంలో చనిపోకుండా బ్రతికారు.
10వ కథ
గొప్ప జలప్రవయం
జలప్రవయం వస్తుందని నోవహు చెప్పినప్పుడు ప్రజలు నవ్వారు. కానీ ఆకాశం నుండి వర్షం కురవడం మొదలైనప్పుడు ఇంక అలా నవ్వలేకపోయారు. నోవహు ఓడ నోవహును, ఆయన కుటుంబాన్ని, చాలా జంతువుల్ని ఎలా కాపాడిందో తెలుసుకోండి.