ద్వితీయోపదేశకాండం 27:1-26

  • ధర్మశాస్త్రాన్ని రాళ్లమీద రాయాలి (1-10)

  • ఏబాలు, గెరిజీము పర్వతాల దగ్గర (11-14)

  • శాపాల్ని మళ్లీ చెప్పడం (15-26)

27  తర్వాత మోషే ఇశ్రాయేలు పెద్దలతో కలిసి ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేడు నేను మీకు ఇస్తున్న ప్రతీ ఆజ్ఞను పాటించండి.  మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజున, పెద్దపెద్ద రాళ్లను నిలబెట్టి వాటికి సున్నం వేయండి.+  మీరు ఆ నది దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ వాటిమీద రాయండి. అప్పుడే మీరు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ప్రమాణం చేసినట్టు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించగలుగుతారు.+  మీరు యొర్దాను నది దాటిన తర్వాత, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నట్టు, ఆ రాళ్లను ఏబాలు పర్వతం+ మీద నిలబెట్టి, వాటికి సున్నం వేయాలి.  అంతేకాదు అక్కడ మీరు మీ దేవుడైన యెహోవాకు రాళ్లతో బలిపీఠం కట్టాలి. ఆ రాళ్లమీద ఇనుప పనిముట్టు పడకూడదు.+  నీ దేవుడైన యెహోవా బలిపీఠాన్ని నువ్వు చెక్కబడని రాళ్లతో కట్టాలి, దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలులు అర్పించాలి.  నువ్వు సమాధాన బలులు+ అర్పించి వాటిని అక్కడే తినాలి,+ నీ దేవుడైన యెహోవా ముందు నువ్వు సంతోషించాలి.+  ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ ఆ రాళ్లమీద స్పష్టంగా రాయాలి.”+  తర్వాత మోషే, అలాగే లేవీయులైన యాజకులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు ప్రజలారా, నిశ్శబ్దంగా ఉండి ఈ మాటలు వినండి. ఈరోజు మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు.+ 10  మీరు మీ దేవుడైన యెహోవా మాట* వినాలి, నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞల్ని, ఆయన నియమాల్ని పాటించాలి.”+ 11  ఆ రోజు మోషే ప్రజలందరికీ ఇలా ఆజ్ఞాపించాడు: 12  “మీరు యొర్దాను నది దాటినప్పుడు, ప్రజల్ని దీవించడానికి ఈ గోత్రాల వాళ్లు గెరిజీము పర్వతం+ మీద నిలబడతారు: షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను. 13  శాపాన్ని ప్రకటించడానికి ఈ గోత్రాల వాళ్లు ఏబాలు పర్వతం మీద నిలబడతారు:+ రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి. 14  అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా అంటారు: 15  “ ‘చెక్కిన విగ్రహాన్ని గానీ,+ పోత* విగ్రహాన్ని గానీ+ తయారుచేసి, దాన్ని దాచిపెట్టినవాడు శాపగ్రస్తుడు; అది చేతిపనులు* చేసే వ్యక్తి తన చేతులతో మలిచినది; అది యెహోవాకు అసహ్యం.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’* అనాలి.) 16  “ ‘అమ్మను గానీ, నాన్నను గానీ నీచంగా చూసేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 17  “ ‘తన పొరుగువాడి సరిహద్దు రాయిని జరిపేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 18  “ ‘గుడ్డివాణ్ణి దారితప్పేలా చేసేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 19  “ ‘పరదేశులకు గానీ, తండ్రిలేని పిల్లలకు* గానీ, విధవరాళ్లకు గానీ న్యాయం తప్పి తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 20  “ ‘తన తండ్రి భార్యతో పడుకునేవాడు శాపగ్రస్తుడు, ఎందుకంటే అతను తన తండ్రిని అవమానపర్చాడు.’*+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 21  “ ‘ఏ జంతువుతోనైనా పడుకునేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 22  “ ‘తన సహోదరితో అంటే తన తండ్రి కూతురితో గానీ, తల్లి కూతురితో గానీ పడుకునేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 23  “ ‘తన అత్తతో పడుకునేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 24  “ ‘మాటువేసి తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 25  “ ‘నిర్దోషిని చంపడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.) 26  “ ‘ఈ ధర్మశాస్త్రంలోని మాటల్ని పాటించనివాడు, వీటిని సమర్థించనివాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్‌!’ అనాలి.)

అధస్సూచీలు

అక్ష., “స్వరం.”
లేదా “అలాగే జరగాలి!”
లేదా “చెక్క పని, లోహం పని.”
లేదా “లోహపు.”
లేదా “అనాథలకు.”
లేదా “తన తండ్రి వస్త్రాన్ని తీశాడు.”