యిర్మీయా 47:1-7
-
ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం (1-7)
47 ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం.+ ఫరో గాజాను ఓడించక ముందు అది వచ్చింది.
2 యెహోవా ఇలా అంటున్నాడు:
“ఇదిగో! ఉత్తర దిక్కు నుండి జలాలు వస్తున్నాయి.
అవి వరదలై పారతాయి.
దేశం మీద, దానిలో ఉన్నవాటన్నిటి మీద,నగరం మీద, దాని నివాసుల మీద ప్రవహిస్తాయి.
మనుషులు ఆర్తనాదాలు పెడతారు,దేశంలో నివసిస్తున్న వాళ్లంతా విలపిస్తారు.
3 అతని మగ గుర్రాల డెక్కల చప్పుడు,అతని యుద్ధ రథాల ధ్వని,అతని చక్రాల శబ్దం వినబడినప్పుడుతండ్రులు తమ కుమారుల కోసం కూడా వెనక్కి తిరిగి చూడరు,వాళ్ల చేతులు చచ్చుబడిపోతాయి,
4 ఎందుకంటే వస్తున్న ఆ రోజు ఫిలిష్తీయులందర్నీ నాశనం చేస్తుంది;+తూరు,+ సీదోనులతో+ సంధి చేసుకున్న మిగతా దేశాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది.
ఎందుకంటే యెహోవా ఫిలిష్తీయుల్ని,కఫ్తోరు*+ ద్వీపం నుండి వచ్చిన వాళ్లలో మిగిలినవాళ్లను నాశనం చేస్తాడు.
5 గాజా తల బోడి అవుతుంది.*
అష్కెలోను నిశ్శబ్దమైంది.+
వాటి లోయ మైదానంలో మిగిలినవాళ్లారా,ఎంతకాలం మీరు మీ శరీరాల్ని కోసుకుంటూ ఉంటారు?+
6 యెహోవా ఖడ్గమా!+
ఎంతకాలం నువ్వు నిమ్మళించవు?
తిరిగి నీ ఒరలోకి వెళ్లు.
విశ్రాంతి తీసుకో, మౌనంగా ఉండు.
7 యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు,అది ఎలా మౌనంగా ఉంటుంది?
అష్కెలోను మీద, సముద్రతీర ప్రాంతం మీద+ఆయన దాన్ని నియమించాడు.”