నలుగురు గుర్రపురౌతులు స్వారీ చేయడం
యేసు పరలోకంలో సాతానుతో అతని చెడ్డదూతలతో యుద్ధం చేసి వాళ్లను భూమ్మీదకు పడదోయడం ద్వారా “జయిస్తూ” బయల్దేరాడు. ఈ చివరి రోజుల్లో ఆయన తన సేవకులకు సహాయం చేస్తూ వాళ్లను కాపాడడం ద్వారా, వాళ్ల తరఫున కూడా తన విజయాన్ని కొనసాగిస్తాడు. ఆయన హార్మెగిద్దోన్లో మిగిలిన ముగ్గురు గుర్రపు రౌతుల స్వారీని ఆపుచేసి వాళ్ల వల్ల కలిగిన నాశనకరమైన ప్రభావాలను మళ్లీ సరిచేసినప్పుడు ఆయన తన విజయాన్ని ‘పూర్తి చేస్తాడు.’